తోసేస్తే చనిపోయాడు: తనయుడి చేతిలో తండ్రి మృతి

తోసేస్తే చనిపోయాడు: తనయుడి చేతిలో తండ్రి మృతి

బెంగళూరు: తాగిన మైకంలో ఉన్న తండ్రిని కొడుకు నియంత్రించడానికి ప్రయత్నించగా ఆయన పొరపాటున జారిపడి చనిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. శశి కపూర్ (60) నుంచి ఆయన కుటుంబ సభ్యులు రూ. 500 నోటు తీసుకున్నారు. దీంతో శశి వారిని దుర్భాషలాడాడు. ఈ క్రమంలో తన కొడుకు నవీన్ తో ఆయన వాగ్వాదానికి దిగాడు. ఇంటి నుంచి బయటికెళ్లి శశి తిట్టడం మొదలుపెట్టడంతో నవీన్ ఆయనను శాంతబర్చడానికి యత్నించాడు. ఆ టైమ్ లో ఇంట్లోకి వెళ్లాల్సిందిగా శశిని నవీన్ నెట్టాడు. కానీ శశి బాగా తాగి ఉండటంతో అదుపు తప్పి దగ్గర్లోని ఒక పదునైన వస్తువుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన శశి ప్రాణాలు కోల్పోయాడు. పోస్ట్ మార్టం ద్వారా చావుకు సంబంధించిన కారణాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.