
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది.. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ ఏకంగా 15 కార్లను ఢీకొంటూ వెళ్ళాడు. గురువారం ( జూన్ 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ సుమారు 15 కార్లను ఢీకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనతో రోడ్డు మీద ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. చింతల్ మెట్ 9వ నంబర్ పాడి నుండి అత్తాపూర్ చౌరస్తా వరకు వాహనాలను ఢీకొంటూ వెళ్లినట్లు తెలుస్తోంది.
అత్తాపూర్ చౌరస్తా దగ్గర ఓవర్ స్పీడ్ తో డివైడర్ ఢీకొనడంతో కారు ఆగిపోయింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణమని నిర్దారించారు పోలీసులు.
ALSO READ | బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ లో కారు డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి.. ఇటీవల అత్తాపూర్ లోనే ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందింది. గురువారం ( జూన్ 19 ) జరిగినఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నంబర్ 198 దగ్గర హైవేపై జరిగిన ప్రమాదంలో సయ్యద్ ఆశ్ర అనే గర్భిణి మృతి చెందింది. హైవేపై నిర్లక్ష్యంగా కారు పార్క్ చేసి డోర్ తెరిచి పెట్టడంతో ఆర్టీసీ బస్సు కింద పడి గర్భిణి మృతి చెందింది.
ఆశ్రపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం, రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై కారును నిర్లక్ష్యంగా ఆపి డోర్ తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు స్థానికులు.
ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు