శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మందుబాబుల వీరంగం..

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మందుబాబుల వీరంగం..

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. పార్కింగ్ సిబ్బంది పైకి దాడికి దిగి కాసేపు హై టెన్షన్ వాతావరణం సృష్టించారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఎయిర్ పోర్ట్ లోని ఏరో ప్లాజా బార్ లో ఫుల్లుగా మద్యం సేవించి తమ కార్ పార్క్ చేసిన పార్కింగ్ ప్లేస్ కు వచ్చారు. అక్కడే ఉన్న పార్కింగ్ సిబ్బంది పై వాగ్వాదానికి దిగి దాడి చేశారు. వీరికి తోడు ఇంకొంత మంది చేరారు. దీంతో అక్కడ కాసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 వెంటనే పార్కింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. భయాందోళనకు గురైన నలుగురు పారిపోయే ప్రయత్నం చేశారు. చైన్ టైన్స్ భ్యారిగేట్ లను సీఐఎస్ఎఫ్ సిబ్బంది మూసేసి వారిని పట్టుకున్నారు. టాటా సఫారీ కారులో ఉన్న నలుగురు వ్యక్తులను పట్టుకునే క్రమంలో జమ కూడిన వారు పరారయ్యారు. పట్టుకున్న నలుగురిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.