పంజాబ్లో ఘోరం..శవమై కనిపించిన డీఎస్పీ..

పంజాబ్లో ఘోరం..శవమై కనిపించిన డీఎస్పీ..

పంజాబ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. పోలీస్ ఉన్నతాధికారి శవమై కనిపించడం స్థానికంగ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న దల్బీర్ సింగ్ బాడీ శవమై కనిపించింది. తలకు గాయాలతో అతని శవం జలందర్ లోని బస్తీ బావా ఖూత్ లో రోడ్డు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.  డిసెంబర్ 31 మధ్య రాత్రి బస్తీ బావా ఖేల్ కెనాల్ నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. బాడీ పడిన ప్రదేశంలోని సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.  

దల్బీర్ సింగ్ సోదరుడు రంజిత్ సింగ్ మాట్లాడుతూ అనుమానాస్పద పరిస్థితుల్లో తలకు గాయాలైన మృతదేహాన్ని గుర్తించడంతో పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. తొలుత ప్రమాదం జరిగినట్లు అనుమానించిన పంజాబ్ పోలీసులు పోస్ట్ మార్టంలో దల్బీర్ మెడలో బులెట్ ఇరుక్కున్నట్లు గుర్తించారని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీ ముగిసాక అతన్ని బస్ స్టాండ్ వెనక వదిలి వెళ్లిపోయానని స్నేహితులు చెప్పారు. డీఎస్పీ చావు వెనక ఉన్నది ఎవరన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.