బీటెక్ విద్యార్థిని రేణు శ్రీ ఆత్మహత్య పై డీఎస్పీ ఎమన్నారంటే..

బీటెక్ విద్యార్థిని రేణు శ్రీ ఆత్మహత్య పై డీఎస్పీ ఎమన్నారంటే..

గీతం కాలేజీ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతుంది. కాలేజీ బిల్డింగ్ ఆరవ అంతస్తు పై నుంచి దూకే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆత్మహత్య పై పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి స్పందించారు. రేణు శ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుందని తెలిపారు.  ఆమె బిల్డింగ్ ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. స్పాట్ లోనే రేణు శ్రీ మృతి చెందిందని అన్నారు.

 పోస్టమార్టం పూర్తయిందని కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించామని డీఎస్పీ చెప్పారు.  రేణు శ్రీ ఫోన్ సీజ్ చేశామని తెలిపారు. చనిపోయేముందు ఎవరితో మాట్లాడిందో అని ఆరా తీస్తున్నామని అన్నారు. రేణు శ్రీ ఆత్మహత్యకు గల కారణాల పై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ నిర్లక్ష్యం కనబడితే వాళ్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.