మా ఫోన్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తుంది

మా ఫోన్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తుంది
  • అమిత్ షా, కేంద్ర ఎన్నికల సంఘానికి రఘునంద‌న్ ఫిర్యాదు
  • హ‌రీశ్ రావు ఆదేశాల మేర‌కు పోలీసులు చేశార‌ని ఆరోప‌ణ‌

త‌న ఫోన్లు, త‌న సిబ్బంది ఫోన్ల‌ను తెలంగాణ స‌ర్కారు ట్యాపింగ్ చేస్తుందంటూ కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు దుబ్బాక బీజేపీ అభ్య‌ర్ధి రఘునంద‌న్ రావు. రాష్ట్ర సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేర‌కు తెలంగాణ పోలీసు విభాగం ఈ ట్యాపింగ్ చేస్తున్న‌ద‌ని, వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. అక్టోబ‌ర్ 5 న జ‌రిగిన‌ సంఘ‌ట‌న ద్వారా ఇది రుజువ‌య్యింద‌ని, వెంట‌నే ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచార‌ణ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.