ఏసీబీ విచారణలో బంజారాహిల్స్ సీఐకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఏసీబీ విచారణలో బంజారాహిల్స్ సీఐకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ఏసీబీ అధికారుల విచారణలో బంజారాహిల్స్ సీఐ నరేందర్ కు అస్వస్థత ఏర్పడడంతో అధికారులు ఆయన్ను సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు.హోమ్ గార్డ్ హరిని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఎస్ఐ నవీన్ ను మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టషన్ లోనే ఇంకా విచారిస్తున్నారు.

రాక్ క్లబ్ పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. రూ.4.5 లక్షలు అడిగారని పబ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 30వ తేదీన పబ్ నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశాడు యజమాని లక్ష్మణ్​ రావు. 

రాక్ క్లబ్ పబ్ విషయంలో డబ్బులు డిమాండ్ చేశారనే అందిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ సీఐ నరేందర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. గతంలో రాక్ క్లబ్ పబ్ లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారని పబ్ ని సీఐ నరేందర్ సీజ్ చేశారు. పబ్ ను ఓపెన్ చేయాలంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని సీఐ నరేందర్ పై పబ్ నిర్వాహకులు లక్ష్మణ్​ రావు ఫిర్యాదు చేశారు. అయితే.. రూ.5 లక్షలు ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించారు. కానీ .. సీజ్ చేసిన నెలలకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందిగా ఎస్.ఐ, హోం గార్డ్ తో డిమాండ్ చెయించారని సీఐ నరేందర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఐ, ఎస్ఐ, హోం గార్డ్ టార్చర్ భరించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు లక్ష్మణ్​ రావు.  

ఫిర్యాదు చేశాడని తెలుసుకొని పబ్ పై అనవసరంగా కేసులు వేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నారని మరోసారి  సీఐ, ఎస్ఐ, హోం గార్డ్స్ పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సీఐ నరేందర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.