
కేంద్రమంత్రి ప్లహ్లాద్ జోషితో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటి అయ్యారు. తెలంగాణలో ప్రవేశ పెట్టు న్యూ ఎనర్జీ పాలసీ గురించి చర్చించారు. సోలార్ పవర్ పై ఫోకస్ పెట్టామని కేంద్రమంత్రి వివరించారు. ఇంకా పలు కీలక విషయాలపై చర్చించామన్న భట్టి... తెలంగాణలో సెల్ప్ హెల్ప్ గ్రూపులకు సోలార్ పవర్ ను అప్పగిస్తామన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడేలా సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యుత్ విషయంలో కొత్త స్కీం అమలు చేస్తామని .. కుసుం సీ పథకం కింద లక్ష సోలార్ పంపు సెట్లను గిరిజనులకు పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా కోరామని.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిచారన్నారు. విద్యుత్ సంస్కరణల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.