
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది.మూడు పబ్ యజమానుల పైన కేసులు నమోదు చేసిన ఈగల్ టీం.. పబ్బు యజమానులకు నోటీసులు జారీ చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలున్నట్లు గుర్తించింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా తేల్చింది ఈగల్ టీం.
పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన యాజమాన్యాలు. వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు. క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టి కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు తెలిపాడు రెస్టారెంట్ యాజమాని అన్నమనేని సూర్య. మరో నాలుగు పబ్ యజమానుల పాత్ర పై కూడా విచారణ జరుపుతోంది ఈగల్ టీం.
ఈ కేసులో పోలీస్ అధికారుల కొడుకుల గట్టురట్టు అవుతోంది. స్థానిక డ్రగ్ పెడ్లర్లతో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు ఈగల్ (టీజీ ఏఎన్బీ) టీమ్ దర్యాప్తులో బయటపడింది. ఈ మేరకు సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్రావు కుమారుడు మోహన్, మాజీ అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్రావు కొడుకు రాహుల్ తేజను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. రాహుల్ తేజ గతేడాది డిచ్పల్లిలోనూ డ్రగ్స్ కేసులో పట్టుబడినట్టు తెలిసింది. వీరిద్దరి కాంటాక్ట్లో ఉన్న డ్రగ్స్ కస్టమర్ల వివరాలు సేకరిస్తోంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న అన్నమనేని సూర్యను ఈ నెల 7న ఈగల్ టీమ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యతో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న హిమాయత్నగర్కు చెందిన హర్ష, కరీంనగర్కు చెందిన జువ్వాడి సందీప్, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్, రాహుల్ తేజ, పబ్బుల నిర్వాహకులు సహా మొత్తం 25 మందిని ఈగల్ టీమ్ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇందులో మోహన్, రాహుల్ తేజ పోలీస్ అధికారుల కుమారులుగా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలోనే సూర్య కాంటాక్ట్లో ఉన్న నైజీరియన్స్, గంజాయి సప్లయర్లు, క్యారియర్ల సమాచారం రాబడుతోంది.