
తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ఈగల్ టీం మెరుపు దాడులు చేస్తోంది. ఈగల్, జీఆర్పీ,ఆర్పీఎఫ్ పోలీసుల కలిసి దాడులు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నలుగురు డ్రగ్ పేడ్లర్లు అరెస్టు చేసి 91 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 5 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు.
వరంగల్లో కొణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాదీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు పరిధిలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులను నుంచి రూ. 7.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వరంగల్ ఐనవోలు పరిధిలో ఓ ఫెడ్లర్ ను అరెస్టు చేసి 214 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. దీని విలువ రూ.53.5 లక్షలు ఉంటుందని చెప్పారు.
సంగారెడ్డిలో ఆల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ ను గుట్టురట్టు చేశారు పోలీసులు. 270 గ్రాముల అల్ఫా జోలం,7.890 కేజీల నోర్డయాజిపామ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, గౌండ్ల మల్లేశంను అరెస్టు చేశారు పోలీసులు. ఈ దాడుల్లో 16.31 లక్షలు విలువైన డ్రగ్స్,పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు...