మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం తెల్లవారుజామున ఖమ్మం నగరంలో పర్యటించారు. నగరంలోని కాలనీల్లో సైకిల్పై పర్యటించి.. శానిటేషన్ పనులతో పాటు అనేక సమస్యలను స్వయంగా పరిశీలించారు. చెత్త కనపడిన ప్రాంతాల్లో ఆగి కారణాలను ఆరా తీశారు. అభివృద్ధి పనులతో పాటు సమస్యల పరిష్కరానికి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో మంత్రి పువ్వాడ తో పాటు జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.