కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు

కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలింపు

హైదరాబాద్:లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. రాత్రి కి ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ కి తరలించనున్నారు. శుక్రవారం (మార్చి 15) మధ్యాహ్నం నుంచిఈడీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మొత్తం 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీకవిత, ఆమె భర్త, సిబ్బందితో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం  ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ కి తరలించనున్నారు.