హైదరాబాద్ మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు,ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. మొత్తం 15 టీంలతో సోదాలు చేస్తున్నారు.
మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్ లకు డైరెక్టర్ గా ఉన్నారు మాలినేని సాంబశివరావు.