
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో కేంద్ర చేనేత జౌళిశాఖ ఎన్ఫోర్స్ మెంట్ (ఈడీ) ఆఫీసర్లు బుధవారం దాడులు నిర్వహించారు. టౌన్ సీఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేనేత జౌళిశాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) ఆఫీసర్లు మనోహర్, స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశంలకు పవర్లూమ్స్పై ఉత్పత్తి చేసిన కాటన్ బట్టలను మార్కెట్ లో అమ్ముతున్నారని ఫిర్యాదు అందింది. దీంతో వారు సిరిసిల్ల నెహ్రూ నగర్ కు చెందిన బట్టల వ్యాపారి అన్నల్దాస్ శ్రీనివాస్ , బచ్చు శ్రీనివాస్ చేనేత పరిశ్రమకు రిజర్వ్ చేసిన బట్టలను పవర్లూమ్స్ పై ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత మగ్గం హ్యాండ్లూమ్ పై ఉత్పత్తి చేయాల్సిన బట్టలను పవర్లూమ్పై ఉత్పత్తి చేయడం చేనేత రిజర్వేషన్ చట్టం – 1985 ప్రకారం నేరం. దీంతో ఈడీ ఆఫీసర్లు తనిఖీలు చేసి రూల్స్ అతిక్రమించినట్టు నిర్ధారించారు. వారిపై టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.