హైదరాబాద్ : ఫాంహౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను ఈడీ అధికారులు రెండో రోజు ప్రశ్నించనున్నారు. కేసుకు సంబంధించి నందకుమార్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయనున్నారు. వ్యాపార భాగస్వాములు, ఇతర పరిచయాలపై ఈడీ అధికారులు నందకుమార్ ను మొదటిరోజు ఆరా తీశారు. ఇవాళ ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ పాత్రపై ఈడీ అధికారులు ప్రశ్నలు వేయనున్నారు. ఇవాళ్టి విచారణలో నందకుమార్ స్టేట్ మెంట్ కీలకంగా మారనుంది.
మొయినాబాద్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో నిందితుడు నందకుమార్ను రెండు రోజులపాటు విచారించేందుకు న్యాయస్థానం ఈడీ అధికారులకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పెద్ద మొత్తంలో నిధుల మళ్లింపు జరిగినట్లు అనుమానం ఉందన్న కారణంతో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇందులో ఫిర్యాదుదారుగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, అభిషేక్ ఆవాలాను ఈడీ ఇంతకు ముందే విచారించింది. ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ను చంచల్ గూడా జైలులోనే విచారిస్తున్నారు.