భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చదువుకున్నవాళ్లు రాజకీయ నాయకులు అయితే బాగుంటుందని జీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్, స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. డాక్టర్జీఎస్సార్ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం యువశక్తి–యంగ్ లీడర్స్ పేర కొత్తగూడెం క్లబ్ లో శనివారం నిర్వహించిన వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలె తప్ప దానికి బానిస కావొద్దన్నారు. సెల్ఫోన్తో బంధాలు, బాంధవ్యాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. కొత్తగూడెంలోని జిల్లా లైబ్రెరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పెడతామన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు కె. నాగేశ్వరరావు, సుధీర్ నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు.