
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి డి.శ్రీధర్బాబు చెప్పారు. వీటి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా వెనుకాడబోమన్నారు. పద్మారావునగర్ లోని సర్దార్పటేల్ కాలేజీలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియం, కామర్స్వింగ్బిల్డింగ్ ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎస్పీ కాలేజీలో చదువుకున్న ఎంతో మంది దేశ, విదేశాల్లో స్థిరపడ్డారని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా కాలేజీలు, విద్యాసంస్థలు సేవా భావంతో పనిచేయడం అభినందనీయమన్నారు. కాలేజీలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఏఓ రాహుల్ యాదవ్, సూపరింటెండెంట్ జావిద్ హుస్సేన్ ను మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా సన్మానించారు. కాలేజీ పాలకమండలి చైర్మన్ ఎస్.రాజేందర్, సెక్రెటరీ బి.సురేందర్ రెడ్డి, ట్రెజరర్ సూరజ్ సింగ్, ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్, ప్రిన్సిపాల్హేమలత, వైస్ ప్రిన్సిపాల్అమర్ నాథ్ శర్మ, ఎస్.ఎస్.ఎస్ ఆఫీసర్ జ్యోత్స్న పాల్గొన్నారు.