కరోన వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుందేమోనన్న భయంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వాటితో పాటుగా సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు మరియు ఫంక్షన్ హాల్స్ కు కూడా ఈ నెల 31 వరకు కొన్ని నియమాలతో కూడిన బంద్ ప్రకటించింది. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ఈ అదేశాలను కొన్ని ప్రైవేట్ స్కూల్స్ పట్టించుకోకుండా యథావిధిగా వాటిని నడుపుతుంది.
ఈ విషయం విద్యాశాఖ దృష్టికి రావడంతో నగరంలోని పలు విద్యాలయాలు ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అధికారుల తనిఖీల్లో హైదరాబాద్ లోని మొత్తం పది ప్రైవేట్ పాఠశాలలు క్లాసులు నడిపిస్తున్నట్టగా తెలిసింది. దీంతో విద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రరామచంద్రన్ ఆ పాఠశాలలకు నోటిససులు జారీ చేశారు. ఆ స్కూళ్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరెవరైనా ప్రభుత్వ అదేశాలను కాదని స్కూల్స్ నడుపుతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తనిఖీలు చేపట్టిన ఆ పది ప్రైవేట్ స్కూళ్లు ఇవే
- VIP ఇంటర్నేషనల్ స్కూల్ (సైదాబాద్,చార్మినార్, బహదూర్ పుర )
- స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ (చార్మినార్)
- షిరీన్ పబ్లిక్ స్కూల్ (సికింద్రాబాద్)
- ఖుష్బూ స్కూల్ (షేక్పేట్)
- జాషువా స్కూల్ (షేక్పేట్)
- సన్రైజ్ స్కూల్ (షేక్పేట్)
- రోజరీ కాన్వెంట్ స్కూల్ (గన్ ఫౌండ్రి)
- ఆల్ సెయింట్స్ హై స్కూల్ (గన్ ఫౌండ్రి)
- లిటిల్ ఫ్లవర్ స్కూల్ (అబిడ్స్)
- సెయింట్ మార్క్స్ టౌన్ స్కూల్ (బహదూర్పుర)