ఎయిమ్స్ లో చేరిన  కేంద్ర మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌

ఎయిమ్స్ లో చేరిన  కేంద్ర మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌ ఇవాళ(మంగళవారం) ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కరోనా తర్వాత వచ్చే ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నారు. 

61 ఏళ్ల పోఖ్రియల్ నిశాంక్ గత ఏప్రిల్ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కొవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్లో  విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్ల సూచనతో ఆయన ఎయిమ్స్లో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.