షెడ్యూల్ రిలీజ్: ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యా సంస్థ‌లు ఓపెన్

షెడ్యూల్ రిలీజ్: ఏపీలో నవంబర్ 2 నుంచి విద్యా సంస్థ‌లు ఓపెన్

ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి  విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. కరోనా కారణంగా సుదీర్ఘకాలం పాటు మూతపడిన స్కూళ్లు, కాలేజీలు నవంబరు 2 నుంచి తిరిగి  ఓపెన్ కానున్నాయి. నవంబరు 2 నుంచి దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించగా,  దానికి సంబంధించి రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నీ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.

నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. అయితే వీటిని హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. నవంబరు 12 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు జరుపుతారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం అవుతుంది..అది కూడా రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నియమావళికి అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతుల నిర్వహణ జరపాల్సి ఉంటుందని నీలం సాహ్నీ షెడ్యూల్ లో తెలిపారు.