ఇలా ఉన్నారేంట్రా.. ఒకే బైక్పై ఎనిమిది మంది ర్యాష్ డ్రైవింగ్.. పోలీసులు ఏం చేశారంటే..

ఇలా ఉన్నారేంట్రా.. ఒకే బైక్పై ఎనిమిది మంది ర్యాష్ డ్రైవింగ్.. పోలీసులు ఏం చేశారంటే..

ఒక బైక్ పైన ఎంత మంది కూర్చుంటారు? మహా అయితే ముగ్గురు లేదా అతి కష్టంగా నలుగురు. కానీ ఈ ఆకతాయిలు ఏకంగా ఎనిమిది మంది బైక్ పై కూర్చుని హైవే ఎక్కారు. బైక్ ఆక్యుపెన్సీపై వరల్డ్ రికార్డు సృస్టించాలని అనుకున్నారో ఏమో.. ఎంచక్కా హ్యండిల్ మీద ఒకరు.. ట్యాంక్ పైన ముగ్గురు, సీట్ పైన ముగ్గరు.. వెనక సప్పోర్ట్ గ్రిప్ పైన మరొకరు.. చూస్తుంటేనే భయం వేసేలా ఉంది వీళ్ల డ్రైవింగ్. 

ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డుపై ఒకే బైక్ పై ఎనిమిది మంది ప్రయాణిస్తూ విన్యాసాలు చేశారు. వాళ్ల విన్యాసాలను వీడియో తీసిన వారిని.. ఎందుకు వీడియో తీస్తున్నారు..’’ అంటూ హెచ్చరిస్తూ నవ్వులు, కేరింతలతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వీడియో పోలీసులకు చేరడంతో ట్రాఫిక్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ కర్నూల్‌ రోడుపై ఒక ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రయాణించారని చెప్పారు.  ఫ్రెండ్స్ తో వీడియో తీయించి ఎక్స్‌(ట్వీటర్‌)లో పోస్టు చేశారని తెలిపారు.

ఆకతాయిల ర్యాష్ డ్రైవింగ్ పై  సైబరాబాద్‌ సోషల్‌ మీడియా సెల్‌ నుంచి ఫిర్యాదు అందిందని.. వెంటనే టీమ్‌ను ఏర్పాటు చేసి ఎనిమిది మంది యువకులను ట్రేస్‌ చేశామని సీఐ తెలిపారు. వారిని సోమవారం (జూన్ 23) అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్‌ చేసినట్లు చెప్పారు. అదే విధంగా నిర్లక్ష్యంగా వాహనం నడపంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.