తెలంగాణలో ఓటమి తప్పదనే మహారాష్ట్రకు..కేసీఆర్ టూర్​పై సంజయ్ రౌత్ ఫైర్

తెలంగాణలో ఓటమి తప్పదనే మహారాష్ట్రకు..కేసీఆర్ టూర్​పై సంజయ్ రౌత్ ఫైర్

ముంబై: తెలంగాణలో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని అర్థం కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర వైపు చూస్తున్నారని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్​ విమర్శించారు. మరాఠా రాజకీయాల్లో కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. 

ALSO READ:నేడే సీతమ్మ సాగర్ కు ఎన్జీటీ ద్విసభ్య కమిటీ

సీఎం కేసీఆర్  మహారాష్ట్రలోని పండరీపూర్​లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఇలాంటి టూర్లు చేపడుతూ డ్రామాలు చేస్తుంటే సొంత రాష్ట్రంలోనూ ఆయనకు ఓటమి తప్పదన్నారు. తన పార్టీ నుంచి నేతలు ఎక్కడ కాంగ్రెస్ లో చేరతారోననే టెన్షన్ తో వాళ్లను వెంటబెట్టుకుని మహారాష్ట్రకు వచ్చారని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి బలంగా ఉందని చెప్పారు.