మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడిన ఆమె తన కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు కొండా సురేఖ. ఐదు రోజులగా జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేయడంతో డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారరణ అయ్యింది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో డాక్టర్ల కొండా సురేఖకు చికిత్స అందిస్తున్నారు. రోజువారి కార్యక్రమాలను మంత్రి ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటూ, అవసరమైన సూచనలు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకుని మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారు.