
కరోనా బారిన పడి గంటల వ్యవధిలో వృద్ద దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణంలో జరిగింది. సిద్దిపేట పట్టణానికి చెందిన ఐత లింగం(80) అతని భార్య భూలక్ష్మి (75) లు కరోనా భారిన పడి మృతి చెందారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్థారించగా సోమవారం రాత్రి సిద్దిపేట కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో చేరే సమయంలో భూ లక్ష్మి మృతి చెందగా అర్థరాత్రి 1 గంట సమయంలో లింగం మృతి చెందాడు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే వృద్ద దంపతులు మృతి చెందడం పలువురిని కలచివేసింది.