చెత్త అనుకొని జేసీబీతో తీసేసి.. జీహెచ్ఎంసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలి

చెత్త అనుకొని జేసీబీతో తీసేసి.. జీహెచ్ఎంసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలి

బషీర్​బాగ్, వెలుగు: జీహెచ్ఎంసీ జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యానికి చెత్త కవర్లు ఏరుకునే ఓ వృద్దురాలు మృతి చెందింది. హిమాయత్ నగర్ లోని గాంధీ కుటీర్ వద్ద శనివారం ఉదయం కవర్లు కప్పుకుని వృద్ధురాలు రేఖ(58) పడుకుంది. చెత్త అనుకొని జేసీబీ డ్రైవర్ ఆమెను వాహనంతో తీసివేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో భయపడిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పారిశుధ్య కార్మికులు 108 కు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకొని మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. రేఖ కుమార్తె సోని ఫిర్యాదుతో ఈ ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.