ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్.. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?

ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్.. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?

ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసా​యిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం ( అక్టోబర్ 27) విడుదల చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రతి జిల్లాలో రాజకీయ పార్టీలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఏపీలో మొత్తం ఓటర్లు  4 కోట్ల ఒక లక్ష 53 వేల 292 మంది ఉండగా ఇందులో పురుషులు కోటి 98 లక్షల 31 వేల 791....  మహిళలు 2 కోట్ల 3లక్షల 85 వేల 851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775   19 లక్షల 79 వేల 775 మంది ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7 లక్షల 40 వేల 857 మందిఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

జాబితా ఇదే..

  • మొత్తం ఓటర్లు- 4,01,53,292
  • పురుషులు- 1,98,31,791
  • మహిళలు - 2,03,85,851
  • ట్రాన్స్ జెండర్లు - 3808
  • సర్వీస్ ఓటర్లు 66,158
  • పోలింగ్ కేంద్రాలు - 46,165
  • అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా అనంతపురం 19,79,775
  • అత్యల్ప ఓటర్లు కలిగిన జిల్లా అల్లూరి సీతారామరాజు 7,40,857 

 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21 లక్షల 18  వేల 940  ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767     2 లక్షల 51 వేల 767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది.  ఒక లక్ష 57 వేల939  ఇళ్లలో 10 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టు తేలిందని చెప్పారు.