తెలంగాణ, ఏపీ MLC స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్..

తెలంగాణ, ఏపీ MLC స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన MLC స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో ఒక MLC, ఆంధ్రలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  ఏపీలోని కరణం బలరాం కృష్ణమూర్తి ,అల్లా కాళీకృష్ణ ,వీరభద్ర స్వామి రాజీనామాలతో మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనుండగా… తెలంగాణ లో యాదవ్ రెడ్డి పై అనర్హత వేటుతో ఆయన స్థానం ఖాళీ అయింది.

ఆగస్టు 7 వతేదీనాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 14 ఆగస్టు నాడు నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ అని చెప్పారు. నామినేషన్ల పరిశీలన ఆగస్టు 16 వతేదీ వరకు జరుగుతుందని.. ఉపసంహరణకు ఆగస్టు 19 వరకు గడువు ఇస్తున్నట్లు చెప్పారు అధికారులు.

MLC ఎన్నికలను ఆగస్టు 26న నిర్వహించనున్నామని… పొద్దున 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలీంగ్ ఉంటుందని చెప్పారు ఎన్నికల అధికారులు.  అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు కూడా పూర్తి అవుతుందని అన్నారు.