పెరగనున్న ఎలక్ట్రిక్​ బస్సులు .. 2025 నాటికి వీటి వాటా 13 శాతానికి

పెరగనున్న ఎలక్ట్రిక్​ బస్సులు .. 2025 నాటికి వీటి వాటా 13 శాతానికి

న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ఎంకరేజ్​ చేయడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను భారీగా పెంచనుంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త బస్సుల విక్రయాల్లో  వీటి వాటా 13 శాతం వరకు పెరుగుతుందని  రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం తెలిపింది.  దీని రిపోర్ట్​ ప్రకారం.. అనేక రాష్ట్ర  ప్రభుత్వాలు ఎలక్ట్రిక్​ -బస్సుల సంఖ్య పెంపునకు ఇది వరకే  ప్రణాళికలను ప్రకటించాయి. ప్రత్యేక పాలసీలనూ తెచ్చాయి. ఇన్సెంటివ్స్​ ఇస్తున్నాయి.  సాధారణ డీజిల్ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులతో డబ్బు చాలా ఆదా అవుతుంది. 

కాలుష్యం బెడద ఉండదు. నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. "భారతదేశ  ఎలక్ట్రిఫికేషన్​ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ బస్సులు   ముందంజలో ఉంటాయని ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ విభాగం ఆరోగ్యకరమైన వృద్ధిని  సాధిస్తుందని మేం భావిస్తున్నాం. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త బస్సుల విక్రయాలలో 11–-13 శాతం ఈ–-బస్సులే ఉంటాయి" అని ఒక ఇక్రా తన రిపోర్టులో పేర్కొంది.  ప్రభుత్వ రాయితీలు,  అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల వల్ల ఎలక్ట్రిక్ బస్సుల బస్సుల ధరలు ఇంకా దిగి వస్తాయి. ఎలక్ట్రిక్ బస్సుల సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. 

2023 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం బస్సుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వాటా ఏడు శాతం వరకు ఉంది. ఫాస్టర్​ అడాప్షన్​ అండ్​ మానుఫాక్చరింగ్​ ఆఫ్​ హైబ్రిడ్​ అండ్​ ఎలక్ట్రిక్​ వెహికల్స్​(ఫేమ్​) వంటి స్కీముల కారణంగా ఎలక్ట్రిక్  బస్సుల వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పథకం వచ్చే మార్చిలో ముగుస్తుంది.  రాబోయే నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్​మరింత పుంజుకునే అవకాశం ఉంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్​ఎల్​) ద్వారా తీసుకొచ్చిన టెండర్లు, బిడ్ అగ్రిగేషన్ ద్వారా ఈ–బస్సుల సంఖ్యను స్వీకరణను ప్రోత్సహించాలని ప్రభుత్వం రాష్ట్రాలను కోరుతోంది. డిమాండ్ అగ్రిగేషన్ కారణంగా ఈ టెండర్ల వల్ల ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగింది. 

తయారీదారుల నుంచి సానుకూల స్పందన

ఎలక్ట్రిక్ బస్సుల కోసం నిర్వహించిన మొదటి రెండు టెండర్లలో ఒరిజినల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తయారీదారులు (ఓఈఎంలు) ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండవ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాయితీలు ఇవ్వకపోయినా వచ్చారు. తగిన పేమెంట్​ సెక్యూరిటీ విధానంలో లేకపోవడంతో సీఈఎస్​ఎల్ నిర్వహించిన​ మూడో టెండర్​కు ఓఈఎంల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో తదనంతరం టెండర్​ను రద్దు చేశారు.  ఓఈఎంల  ఈ ఆందోళనలను పరిష్కరించకపోతే ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో నిర్దేశించుకున్న టార్గెట్లను చేరుకోవడం కష్టమవుతుంది. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి ఈ–-బస్ సేవా పథకాన్ని ప్రకటించింది.  పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (పీపీపీ) మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 169 నగరాలకు 10 వేల ఈ-–బస్సులను అందించాలనే లక్ష్యంతో దీనిని చేపట్టారు. ఫేమ్–2 పథకం వచ్చే మార్చిలో ముగుస్తున్నందున, సీఈఎస్​ఎల్​ ద్వారా లేదా పీఎం ఈ–-బస్ సేవా పథకం ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పేమెంట్ సెక్యూరిటీ మెకానిజమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అమలుకు సంబంధించిన ఓఈఎం ఆందోళనలను పరిష్కరించడం, దీర్ఘకాలిక నిధుల లభ్యత ఉండేలా చూడటం, ఇప్పటివరకు సాధించిన ఎలక్ట్రిఫికేషన్​ వేగం ముందుకు సాగేలా చూసుకోవడం చాలా కీలకమని ఇక్రా అభిప్రాయపడింది.