మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్..ఓ జపనీస్ పాప్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెర్మ్ డొనేట్!

మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్..ఓ జపనీస్ పాప్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెర్మ్ డొనేట్!
  • వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్

న్యూయార్క్: టెస్లా,స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. ఆయన ఓ జపనీస్ పాప్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్పెర్మ్ డొనేట్ చేసి బిడ్డను కన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక తాజాగా  వెల్లడించింది. ఎలాన్ మస్క్ తో  రొములస్ అనే కొడుకును కన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆష్లే సెయింట్ క్లెయిర్(26) అనే యువతే ఈ ఆరోపణలు చేసినట్లు నివేదిక వివరించింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మస్క్ ఒక జపనీస్ పాప్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిడ్డను కలిగి ఉన్నారని సెయింట్ క్లెయిర్ చెప్పారు. 2023లో జపనీస్ అధికారులు ఓ ప్రముఖ జపనీస్ మహిళ కోసం మస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్పెర్మ్ డోనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అడిగారని.

దానికి ఆయన సమ్మతించారని వెల్లడించారు. "రొమాన్స్ లేదు, కేవలం స్పెర్మ్ డొనేషన్" అని మస్క్ తనకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా చెప్పారని సెయింట్ క్లెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపినట్లు  నివేదిక వెల్లడించింది. అయితే, ఆ జపనీస్ పాప్ స్టార్ వివరాలను మాత్రం మస్క్ బహిర్గతం చేయలేదని పేర్కొంది. మస్క్ తన స్పెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని..ఇది తన ఔదార్యమని ఆయన చెప్పుకుంటారని నివేదిక తెలిపింది. ప్రజలు ఎక్కువ పిల్లలను కలిగి ఉండాలని ఆయన నమ్ముతారని సెయింట్ క్లెయిర్ తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. కాగా..ఇప్పటికే ఎలాన్ మస్క్ కు నలుగురు మహిళల ద్వారా 14 మంది సంతానం ఉన్నారు. ఈ నివేదిక సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. అయితే, ఈ నివేదికపై మస్క్ ఇంతవరకు స్పందించలేదు. 

ముఖంపై నల్లని మచ్చ.. మస్క్ వివరణ

అమెరికా అధ్యక్ష సలహాదారు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన ఎలాన్ మస్క్​కు అధ్యక్షుడు ట్రంప్ వీడ్కోలు పలికారు. మే 30న తన పదవికి చివరిరోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి మస్క్ వెళ్లారు. ఆ సమయంలో ఆయన కంటిపై ఓ నల్లని గాయం కనిపించింది. ఆ ఫొటో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయింది. తన ఐదేండ్ల కొడుకు 'ఎక్స్' కొట్టడం వల్లే ఆ మచ్చ ఏర్పడిందని మస్క్ చెప్పారు. అలాగే, తాను ఫ్రాన్స్ దగ్గర్లోకి ఏమీ వెళ్లలేదని చమత్కారం చేశారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ దంపతుల మధ్య జరిగిన గొడవలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.