టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘నేను అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం’ అంటూ మస్క్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉక్రెయిన్పై గత కొన్ని రోజులుగా రష్యా దాడులు కొనసాగిస్తోంది. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా రష్యాలో మే 9న విక్టరీ డే నిర్వహిస్తారు. ఈసారి కూడా రష్యాలో విక్టరీ డే వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సానుభూతి పరులపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తూ పరోక్షంగా రష్యాను దెబ్బకొడుతున్న ఎలాన్ మస్క్కు.. రష్యన్ ఆర్మీ కమాండర్ ఓ బెదిరింపు సందేశం పంపాడు. రష్యన్ భాషలో ఉన్న కమాండర్ టెస్టిమోనీ ట్వీట్ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్ లేట్ చేసి ఎలాన్ మస్క్ స్పందించాడు. అంతు చిక్కని పరిస్థితుల్లో తాను చనిపోతే.. అందుకు సంబంధించిన కారణం ముందే తెలుసుకోవడం భలేగా ఉందంటూ కొంటెగా రష్యన్ కమాండర్ను తనదైన స్టైల్లో రెచ్చగొట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిపై నెటిజన్లు తమకు తోచినట్లుగా, ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. మీకు మద్దతుగా మేమున్నామంటూ కొందరు స్పందిస్తుండగా, మీకేమైనా అయితే ట్వీట్టర్ ఉంటుందా..? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో నిలిచిన టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ సంచలనాలకు పెట్టింది పేరు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించటం కష్టం. ట్వీట్టర్ కొనుగోలు విషయంలోనూ గెలిచిన తర్వాత కోకాకోలా, మెక్ డొనాల్డ్ వంటి ప్రముఖ కంపెనీలను కొంటానంటూ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన దిగ్గజ టీకా తయారీ సంస్థ సీరమ్ సీఈవో కూడా ఎలాన్ మస్క్ ను ట్వీట్టర్ లో ట్యాగ్ చేస్తూ పెట్టుబడులకు భారత్ చాలా అనువైన దేశమని చెప్పారు. భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని ట్వీట్టర్ లో సూచించారు.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022
మరిన్ని వార్తల కోసం..