వైద్యం రంగంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

వైద్యం రంగంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం

వైద్యం రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అమీర్ పేట్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి హైదరాబాద్ లో 150 వెల్ నెస్ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. వాటికే తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాల పేరు పెట్టుకుందని అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కు రూ.800 కోట్ల నిధులు మంజూరు చేసినట్శాలు కిషన్ రెడ్డి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని అన్నారు. 

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు