ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు
షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్
హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంసెట్ మే 4 నుంచి 11 వరకు జరగనుంది. శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఎంసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. అంతకుముందు జేఎన్టీయూ హెచ్లో టీఎస్ ఎంసెట్-2020 కమిటీ సమావేశమైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్చైర్మన్ వెంకటరమణ, జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీ జయేశ్ రంజన్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్తో పాటు కమిటీ సభ్యులు మీటింగ్కు హాజరయ్యారు.
నిమిషం రూల్ ఉంటుంది
ఎంసెట్ నోటిఫికేషన్ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. 21 నుంచి మార్చి 30 వరకు నిర్ణీత ఫీజుతో ఆన్లైన్లో అప్లికేషన్లను తీసుకుంటారు. ఫైన్తో ఏప్రిల్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 20 జోన్ల పరిధిలోని 55 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఏపీ పరిధిలోని కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి జోన్లలోనూ సెంటర్లు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముండడంతో, దీన్ని ఐదు జోన్లుగా విభజించి 23 ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి దివ్యాంగులకు ఫీజులో రాయితీ కల్పించారు. ఇంజనీరింగ్ స్ర్టీమ్కు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ స్టూడెంట్లకు రూ.400, ఇతర విద్యార్థులకు రూ.800గా ఫీజు నిర్ణయించారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్కూ ఇదే ఫీజు ఉంటుంది. ఇక, ఈసారి కూడా నిమిషం లేట్ అయినా పరీక్షకు అనుమతించొద్దని అధికారులు నిర్ణయించారు.
దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్
ఎంసెట్ అప్లికేషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా ఆప్షన్ పెడుతున్నట్టు కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. దానికి ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసే యోచనలో ఉండడంతో ముందస్తుగా ఈ ఆప్షన్ పెడుతున్నామన్నారు. కాలేజీల అఫిలియేషన్ గడువును ఏఐసీటీఈ ఈ నెల 29 వరకు ఇవ్వడంతో, జేఎన్టీయూ కూడా ఈ నెల 20 వరకు గడువు పెంచిందన్నారు. ఇప్పటిదాకా 15 కాలేజీలు మూసేసేందుకు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు.
ఇదీ షెడ్యూల్..
ఫిబ్రవరి 19– ఎంసెట్ నోటిఫికేషన్
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30– ఆన్లైన్ దరఖాస్తులు
ఏప్రిల్ 6– రూ.500 లేట్
ఫీజుతో అవకాశం
ఏప్రిల్ 13– రూ.వెయ్యి లేట్ ఫీజుతో అవకాశం
ఏప్రిల్ 20– రూ.5 వేల ఫీజుతో దరఖాస్తు
ఏప్రిల్ 27– రూ.10 వేల ఫైన్తో దరఖాస్తుకు అవకాశం
మార్చి 31 నుంచి ఏప్రిల్ 3– దరఖాస్తుల్లో తప్పుల సవరణ
ఏప్రిల్ 20 నుంచి మే 1– హాల్టికెట్ల డౌన్లోడ్
మే 4,5,7– ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్
మే 9,11– అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాలకు పరీక్ష
పరీక్ష టైం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు.
మే 2న ఈసెట్
తొలిసారి రెండు విడతలుగా పరీక్ష
20న నోటిఫికేషన్.. 24 నుంచి అప్లికేషన్స్
ఈసెట్ 2020 షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, వెలుగు: డిప్లొమా, డిగ్రీ స్టూడెంట్లకు ఇంజనీరింగ్, బీఫార్మసీ సెకండియర్ అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈసెట్, మే 2న జరగనుంది. తొలిసారిగా రెండు విడతల్లో ఈసెట్ను నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదల కానుంది. శనివారం ఉన్నతవిద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఈసెట్2020 షెడ్యూల్ను విడుదల చేశారు. అంతకముందు సెట్ కన్వీనర్ మంజూర్ హుస్సేన్, సెట్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 24 నుంచి మార్చి 28 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ,ఎస్టీలకు రూ.400, ఇతర స్టూడెంట్లకు రూ.800గా ఫీజును ఖరారు చేశారు. విద్యార్థులకు రూ.400, ఇతర విద్యార్థులకు రూ.800 ఫీజును నిర్ణయించారు. పరీక్షను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెట్టనున్నారు. ఉదయం ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ కోర్సుల వారికి, మధ్యాహ్నం సివిల్, కెమిస్ట్రీ, మెకానికల్, మైనింగ్, మెట్, ఫార్మసీ, బీఎస్ఎం కోర్సుల వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి ఫార్మసీ, కెమికల్ కోర్సులు చేసిన వారికీ బయోటెక్నాలజీ అడ్మిషన్లకు అవకాశమివ్వనున్నారు. ఇప్పటిదాకా కేవలం డిప్లొమా బయోటెక్నాలజీ వారికే అవకాశమిస్తూ వచ్చారు. కానీ, సీట్లు ఎక్కువగా మిగిలిపోతుండడంతో, ఫార్మసీ, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్లకూ అవకాశమిచ్చేందుకు నిర్ణయించారు. 18 రీజనల్ సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ ఈసెట్ షెడ్యూల్
ఫిబ్రవరి 20– నోటిఫికేషన్
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 28– ఆన్లైన్
దరఖాస్తులు
ఏప్రిల్ 8– రూ.500 లేట్ ఫీజుతో అవకాశం
ఏప్రిల్ 18– రూ.వెయ్యి లేట్ ఫీజుతో చాన్స్
ఏప్రిల్ 24– రూ.5 వేల ఫీజుతో
అప్లై చేసుకోవచ్చు
ఏప్రిల్ 28– రూ.10 వేల ఫైన్తో దరఖాస్తుకు చాన్స్