- ఈసీ మీటింగ్లో టీఎన్జీవో నేతలు
హైదరాబాద్, వెలుగు: చాలా జిల్లాల్లో 15వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు రావట్లేదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఉద్యోగులు ఏ హాస్పిటల్కు పోయినా ఈహెచ్ఎస్ చెల్లట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం నాంపల్లిలోని యూనియన్ ఆఫీస్లో టీఎన్జీవో కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మీటింగ్కు హాజరయ్యారు.
ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ సాంక్షన్ కాలేదని, ఉద్యోగుల విభజన, మ్యూచువల్.. స్పౌజ్ బదిలీలు జరగలేదని, అప్పీళ్లు పరిష్కారం కాలేదని తదతరి 13 సమస్యలపై తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చినా అధికారులు అమలు చేయట్లేదన్నారు. అంతకు ముందు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామినాథం మృతికి మామిళ్ల రాజేందర్, బీజేపీ నేత స్వామిగౌడ్ సంతాపం తెలిపారు.