అడివి శేష్ మూవీలో విలన్‌‌‌‌గా.. ఇమ్రాన్ హష్మి

అడివి శేష్ మూవీలో విలన్‌‌‌‌గా.. ఇమ్రాన్ హష్మి

ఒకప్పుడు వరుస రొమాంటిక్ సినిమాలతో సీరియల్ కిస్సర్‌‌‌‌‌‌‌‌గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మి.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విలన్‌‌‌‌ రోల్స్‌‌‌‌తో బిజీ అవుతున్నాడు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘టైగర్‌‌‌‌‌‌‌‌ 3’లో విలన్‌‌‌‌గా మెప్పించిన ఇమ్రాన్.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’లోనూ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా మరో తెలుగు చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటించబోతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. అడివి శేష్​ హీరోగా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘జీ 2’ (గూఢచారి 2) తెరకెక్కుతోంది. బనిత సంధు హీరోయిన్. స్టైలిష్‌‌‌‌ స్పై యాక్షన్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్‌‌‌‌ హష్మి కూడా నటిస్తున్నట్టు గురువారం ప్రకటించారు. 2018లో శేష్‌‌‌‌ హీరోగా వ‌‌‌‌చ్చిన ‘గూఢచారి’ చిత్రానికి ఇది సీక్వెల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.