వెన్నమనెని శ్రీనివాస్ రావు నుంచి కీలక విషయాలను రాబట్టిన ఈడీ

 వెన్నమనెని శ్రీనివాస్ రావు నుంచి కీలక విషయాలను రాబట్టిన ఈడీ

విచారణలో వెన్నమనెని శ్రీనివాస్ రావు నుంచి కీలక విషయాలను ఈడీ రాబట్టింది. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్ర ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ సన్ షోరూమ్, గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మిన రల్స్ కంపెనీలను నిర్వహిస్తున్నారు శ్రీనివాస్ రావు. లిక్కర్ స్కామ్ ముడుపులు ఈ కంపెనీల నుంచే వెళ్లినట్టు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ రామంతాపూర్ లో ప్రారంభించిన శ్రీనివాసరావు.. రిజిస్టర్ అడ్రెస్ మాత్రం ఏపీలోని కడప పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సంబంధం ఉన్న పిళ్లై, అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్, సృజన్ రెడ్డిలకు శ్రీనివాస్ కంపెనీల పేరుతో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది.