ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య : పోలీసుల అదుపులోకి రాహుల్

ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య : పోలీసుల అదుపులోకి రాహుల్

వరంగల్ లో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి రక్షిత కేసులో రాహుల్ అనే యువకుడిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతురు రక్షిత(21) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. తన క్లాస్​మేట్​తో కలిసి ఉన్న ఫొటోలను తోటి స్టూడెంట్లు సోషల్‍ మీడియాలో పోస్ట్​ చేయడంతో కలత చెందిన రక్షిత.. సూసైడ్​ చేసుకుంది. అంతకుముందు రక్షిత వరంగల్ సిటీలోని తన బంధువుల ఇంటికొచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కడే ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం రక్షిత డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.