రాజు ఆత్మహత్యపై హైకోర్టులో పిల్ దాఖలు

రాజు ఆత్మహత్యపై హైకోర్టులో పిల్ దాఖలు

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని లక్ష్మణ్ కోర్టును కోరారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది.