పీఎఫ్ ఆటో సెటిల్మెంట్ లిమిట్పై ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

పీఎఫ్ ఆటో సెటిల్మెంట్ లిమిట్పై ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ) తన సభ్యులకు తీపికబురు చెప్పింది. అత్యవసర వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం/కొనుగోలు,  ఉన్నత చదువు వంటి అవసరాల కోసం ఆటోమేటెడ్ సెటిల్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్స్ (ఏఎస్​ఏసీ) పరిమితిని రూ. లక్ష నుంచి రూ. ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఈపీఎఫ్​ఓ సభ్యులకు  ప్రయోజనం చేకూరనుంది.

అత్యవసర సమయాల్లో నిధుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, త్వరగా పీఎఫ్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లను పొందవచ్చు. ఆటో-క్లెయిమ్ విధానం మనుషుల ప్రమేయం లేకుండా, ఐటీ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. కేవైసీ,  బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయితే,  మూడు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో జమవుతాయి. గతంలో పది రోజుల వరకు సమయం పట్టేది. ఈపీఎఫ్​ఓ 2020 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఆటో-క్లెయిమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.