టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ ను కాంగ్రెస్ నియమించినప్పటి నుంచే ఆ పార్టీ దారుణంగా పడిపోయిందని అన్నారు. మాజీ మంత్రి పొన్నాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి మండిపడ్డారు. రేవంత్ రెడ్డివి నీచమైన మాటలని అన్నారు. కష్టకాలంలో కూడా పదేళ్ల పాటు పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తి పొన్నాల అని చెప్పారు. అలాంటి వ్యక్తిని తిట్టడం చాలా బాధాకరమని తెలిపారు.
కొండంగల్లో రేవంత్ రెడ్డిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తే.. మల్కాజిగిరి నుంచి పోటీ చేశాడని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. దమ్ముంటే రంగారెడ్డి నుండి పోటీ చేయాలని రేవంత్ కు సవాల్ విసిరారు. పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి రేవంత్ రెడ్డి అని మొదటి నుంచి ఆయన గుణం అదేనని ఆరోపించారు. 2023 అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిపెస్టో రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత కాంగ్రెస్ మొత్తమే పడిపోతుందని విమర్శించారు.