ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా

ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఘోర అవమానం జరిగింది. ఏప్రిల్ 17వ తేదీ బుధవారం శ్రీరామనవమి సందర్భంగా పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. గ్రామంలోని  శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వందలాది మంది కార్యకర్తలతో వచ్చి కల్యాణ వేదిక ముందు కూర్చున్నారు.  అదే సమయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు  కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు.

ఈక్రమంలో పోలీసులు దయాకర్ రావు, ఆయన అనుచురలను లేపి పక్కకు పంపించి కూర్చోబెట్టారు. దీంతో అందరి ముందు తనను తక్కువ చేసి వెనక్కి పంపడంతో పురువు పోయిన విధంగా భావించినట్లు ఆయన మొహం హావాభావాలు కనిపించాయి.ఎర్రబెల్లిని మాజీ మంత్రి అని చూడకుండా వెనక కూర్చోపెట్టడంతో ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు.