కాశీబుగ్గ, వెలుగు: నీట్ 2026 జాతీయ స్థాయి ఫలితాలు, ర్యాంకులలో ఎస్సార్ విద్యా సంస్థల స్టూడెంట్స్ అద్భుత ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించినట్లు ఆ సంస్థ చైర్మన్ వరదారెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని ఎస్సార్ విద్యా సంస్థలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్సార్ విద్యా సంస్థలకు చెందిన స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో టాప్ మార్కులతో పాటు జనరల్ కేటగిరిలో ఉత్తమ ర్యాంకులు సాధించి, సంస్థ కీర్తి ప్రతిష్టలను నేషనల్ లెవెల్లో నిలబెట్టారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సార్ విద్యా సంస్థల నుంచి 275 మందికి పైగా మెడిసిన్ సీట్లు సాధించే చాన్స్ఉందని ఆయన వివరించారు. అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ డైరెక్టర్ సంతోష్రెడ్డితో పాటు టీచర్స్, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
