
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే సూపర్టెక్ ఈవీ ఇనీషియల్పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న మొదలై 27న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 29.90 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా 32.50 లక్షల ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ఇష్యూ. షేర్ల ప్రైస్ బ్యాండ్ను రూ.87–రూ.92 మధ్య నిర్ణయించారు. లాట్ సైజ్ 1200 షేర్లు కాగా, కనీస పెట్టుబడి రూ.1,10,400. ఈ నెల 30న షేర్ల అలాట్మెంట్ ఉంటుంది. వచ్చే నెల 2న బీఎస్ఈ, ఎస్ఎంఈలో షేర్లు లిస్టవుతాయి. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలో, కంపెనీ రూ. 16.50 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధులు సమకూర్చుకోవడానికి, రూ. మూడు కోట్లను అప్పుల చెల్లింపునకు వాడనుంది.