జూన్ 25న ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ సూపర్ టెక్ ఐపీఓ

జూన్ 25న ఎలక్ట్రిక్  వెహికల్స్ కంపెనీ సూపర్ టెక్ ఐపీఓ

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్​  వెహికల్స్​ తయారు చేసే సూపర్‌‌‌‌టెక్ ఈవీ ఇనీషియల్​పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న మొదలై 27న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 29.90 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా 32.50 లక్షల ఫ్రెష్​ ఈక్విటీ షేర్ల ఇష్యూ. షేర్ల ప్రైస్ బ్యాండ్​ను రూ.87–రూ.92 మధ్య నిర్ణయించారు.  లాట్ సైజ్ 1200 షేర్లు కాగా, కనీస పెట్టుబడి రూ.1,10,400.  ఈ నెల 30న షేర్ల అలాట్‌‌‌‌మెంట్ ఉంటుంది. వచ్చే నెల 2న బీఎస్​ఈ, ఎస్​ఎంఈలో షేర్లు లిస్టవుతాయి.  ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలో, కంపెనీ రూ. 16.50 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధులు సమకూర్చుకోవడానికి, రూ. మూడు కోట్లను అప్పుల చెల్లింపునకు వాడనుంది.