ప్రతీ బీజేపీ కార్యకర్త కరోనాపై యుద్ధం చేయాలి: బండి సంజయ్

ప్రతీ బీజేపీ కార్యకర్త కరోనాపై యుద్ధం చేయాలి: బండి సంజయ్

కరోనా మహమ్మారిపై యుద్ధం, ప్రధాని మోడీ ప్రభుత్వానికి అండగా ఉందామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. పీఎంకేర్స్ ఫండ్ కు తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్త సహాయం అందించాలన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో పత్రికా ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు కరోనా మహమ్మారిపై యుద్ధానికి సిద్ధం కావాలి. ప్రతి ఒక్కరు 100 రూపాయలు తగ్గకుండా సహాయం చేసి.. పీఎంకేర్స్ ఫండ్ కు మరో పది మందితో సాయం చేయించాలి.

ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య పీఎంకేర్స్ ఫండ్ కు విరాళమిచ్చి , స్క్రీన్ షార్ట్ తీసి #TSDonates2PMCARESతో సోషల్ మీడియాలో షేర్ చేయాలి.

కోవిడ్ 19 పేరుతో సింగరేణి కార్మికులకు జీతంలో కోతవిధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. సింగరేణి ఒక స్వతంత్ర సంస్థ. కార్మికుల కష్టార్జితంతో సంస్థకు వచ్చే లాభాల్లో నుండే వారి జీత భత్యాలు తీసుకుంటారు.. అలాంటి వారి కష్టాన్ని సొమ్ముచేసుకోవడం అవివేకం.

సింగరేణి కార్మికులు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక రోజు జీతం 7 కోట్ల 50 లక్షలు అందించారు.

సింగరేణి కార్మికులకు లాక్ డౌన్ కాకుండా లే ఆఫ్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళ చెందుతున్నారు.

సింగరేణి కార్మికులకు మాస్కులు, షానిటైజేర్స్, గ్లౌస్ లు వెంటనే అందించాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో GO NO ms:27 ను వెంటనే రద్దు చేయాలి.