
షాద్ నగర్: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కన్హా శాంతి వనంలో వెల్ నెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా యోగా నేర్పించడం గొప్ప విషయం అన్నారు. నూతన పరిశోధనలు చేస్తూ రైతులకు మేలు చేస్తురన్న కన్హా శాంతి వనం నిర్వాహకుల కృషిని డిప్యూటీ సీఎం కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ తదితరులు పాల్గొన్నారు.