కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నయ్.. ఏవీ కూలలే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నయ్.. ఏవీ కూలలే : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నాయని, ఏవీ కూలలేదని, ఇదే విషయాన్ని తాను నిరూపిస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం వచ్చినా, మంత్రులు వచ్చిన రైతుల సమక్షంలోనే చర్చిద్దామని సవాల్ ​విసిరారు. కేసీఆర్​కు 3 రోజులు టైమ్​ఇస్తే కన్నెపల్లి పంప్​హౌస్ ​మోటార్లను ఆన్​ చేయించి చూపిస్తామన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం రేవంత్ ​అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్​, టీడీపీ పాలన వల్లే నల్గొండలో ఫ్లోరోసిస్​ మహమ్మారి 2 లక్షల మందిని కబళించిందన్నారు. కాంగ్రెస్​ పాలనలో మళ్లీ ఫ్యాక్షన్​ రోజులను తీసుకొస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించానని, భవిష్యత్​లో తానేంటో చూపిస్తానన్నారు.