Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్!..ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్!..ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8) స్టార్ట్ కాబోతున్న వేళ..ఈ షోలో పాల్గొనే వారెవరూ అనేది ఇంట్రెస్టింగ్ టాక్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పర్సనాలిటీస్‌ను బిగ్ బాస్ 8 ఇంట్లోకి పట్టుకొచ్చేలా ఉన్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాలో ఓ 17 మంది కన్ఫర్మ్ అయినట్లు తెలిసిందే. వారిలో పది మంది పక్కాగా హౌజ్‌లోకి ప్రారంభం రోజునే వెళ్లనున్నారు. కాగా బిగ్ బాస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. 

అదేంటంటే..ఈ సీజన్‌ 8లో ఇదివరకే జరిగిన (పాత సీజన్స్‌) లోని మాజీ కంటెస్టెంట్స్‌ను కూడా రంగంలోకి దింపనున్నారనే టాక్ మొదలైంది.అందులో భాగంగా ఇప్పటికే మాజీ ఇంటి సభ్యులతో బిగ్ బాస్ టీమ్ చర్చలు కూడా జరిపింది. అయితే, వారిలో చాలా మంది మళ్లీ బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదట. కానీ, ఓ ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ మాత్రం రావడానికి ఒప్పుకున్నారట.  మరెవరూ అందులోకి వస్తున్నారంటే..ఒకరు ఆర్జే చైతూ. ఇతను బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో ఇంటి సభ్యుడిగా పాల్గొన్న విషయం తెలిసిందే. మరొకరు జబర్దస్త్ కమెడియన్ అవినాష్.

ALSO READ | Bigg Boss 8 Contestants: తెలుగు బిగ్బాస్ సీజన్ 8..కంటెస్టెంట్స్ వీళ్లేనా?

అవినాష్, ఆర్జే చైతూ ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇస్తే అటు మిగతా కంటెస్టెంట్స్, ఇటు ప్రేక్షకులకు నవ్వుల వినోదమే అని తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్లోగన్ "ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు" అనే ట్యాగ్ కి..ఈ ఇద్దరు పూర్తి న్యాయం చేస్తారని టాక్. ఇంకా మూడు రోజుల్లో సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్  గృహప్రవేశం. తప్పకుండా రండి అంటూ నాగార్జున చెప్పే వీడియోను రిలీజ్ చేశారు.