
శాయంపేట, వెలుగు: ఎక్స్పైరీ అయిన ఫెస్టిసైడ్స్మందులను అమ్మేందుకు ప్రయత్నం చేసిన ఫర్టిలైజర్ అండ్ఫెస్టిసైడ్స్షాపు యజమానిపై కేసు నమోదు చేసి మందులను స్వాధీనం చేసినట్లు శాయంపేట సీఐ రంజిత్రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక మల్లికార్జున ఎంటర్ ప్రైజెస్ ఫర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్ షాపు యజమాని బంక రాజేంద్రప్రసాద్ తన షాపులో కాలం చెల్లిన పురుగుల మందులు విక్రయించేందుకు నిల్వ ఉంచగా ఆదివారం మండల వ్యవసాయ అధికారి గంగా జమున, శాయంపేట సీఐ రంజిత్రావుతో కలిసి తనిఖీ చేశారు. అందులో రూ.9,600 విలువగల ఫెస్టిసైడ్స్లభించినట్లు చెప్పారు. ఈ మేరకు మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వారివెంట ఏఈవో సుప్రియ, పోలీస్సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.