సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్త: కేఏ పాల్

సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్త: కేఏ పాల్

హైదరాబాద్, వెలుగు: ఎనిమిది ఏండ్లుగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. రాష్ట్రం వచ్చినపుడు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, ఇపుడు రూ.5 లక్షల కోట్ల అప్పులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అమీర్​పేటలోని పార్టీ ఆఫీస్​లో పాల్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి బాకీ పడిందన్నారు. వచ్చేనెల 7 నుంచి 16 దాకా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని పాల్ చెప్పారు. సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తానని, యువకులు, రైతులు, నిరుద్యోగులంతా మద్దతివ్వాలని కోరారు.