నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్లతో ఇండ్లు నిర్మిస్తున్న బిల్డర్లను లంచం కోసం బెదిరిస్తున్న బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్పై మంగళవారం కేసు నమోదైంది. నగరంలోని అయోధ్యనగర్లో వంద గజాల స్థలంలో బిల్డర్ గడ్డం ప్రసాద్ నగర పాలక సంస్థ అనుమతులతో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అతడికి ఫోన్ చేసిన కార్పొరేటర్ పవన్తనకు డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఆఫీసర్లను పంపి పనులు ఆపేయిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బిల్డర్ 5వ టౌన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
కార్పొరేటర్ పవన్ డ్రైవర్గా పరిచయం చేసుకొన్న వినోద్.. మరో బిల్డర్అరుణ్కు ఫోన్చేసి డబ్బు డిమాండ్చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినట్లు నగర ఏసీపీ ప్రకాశ్తెలిపారు. తన డివిజన్పరిధిలో కొత్తగా ఇండ్లు నిర్మిస్తున్న వారి నుంచి కార్పొరేటర్పవన్రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. డ్రైవర్ వినోద్పైనా కేసు నమోదు చేశామన్నారు. ఇదిలా ఉండగా తన డివిజన్లో వాటర్ ప్లాంట్ స్థలాన్ని కబ్జా చేయడానికి బిల్డర్అసోసియేషన్ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని మఠం పవన్ నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్కు ఫిర్యాదు చేశారు.
