న్యూఢిల్లీ: దేశం నుంచి బియ్యం (బాస్మతి రైస్ మినహాయించి) ఎగుమతులు రికార్డ్ లెవెల్లో పెరిగాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు 6.11 బిలియన్ డాలర్ల (రూ. 46,400కోట్ల) కు చేరుకున్నాయి. 2013–14 టైమ్లో దేశం నుంచి కేవలం 2.92 బిలియన్ డాలర్ల (రూ.22,192 కోట్ల) విలువైన బియ్యం ఎగుమతులు మాత్రమే జరిగాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 150 కి పైగా దేశాలకు రైస్ను ఎగుమతి చేశాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, 2019–20 లో బియ్యం ఎగుమతులు (బాస్మతి మినహాయించి) 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21 లో ఈ నెంబర్ 4.8 బిలియన్ డాలర్లకు, 2021–22 లో 6.11 బిలియన్ డాలర్లకు పెరిగింది. క్వాలిటీ రైస్ను ప్రొడ్యూస్ చేయడంపై ఫోకస్ చేయడంతో దేశం నుంచి రైస్ ఎగుమతులు పెరిగాయని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చైర్మన్ ఎం అంగముతు అన్నారు. పశ్చిమాఫ్రికా దేశమైన బెనిన్ మన దగ్గర నుంచి ఎక్కువగా రైస్ను దిగుమతి చేసుకుంది. నేపాల్, బంగ్లాదేశ్, చైనా, సెనెగల్, గినియా, వియత్నాం, మడగాస్కర్, కెమరూన్ సోమాలియా, మలేషియా, లిబియా, యూఏఈ వంటి దేశాలు ఇండియా నుంచి ఎక్కువగా రైస్ను దిగుమతి చేసుకున్నాయి. పోర్టులు, పోర్టు రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడం, సప్లయ్ చెయిన్ను మరింత మెరుగుపరచడం, కొత్త మార్కెట్లను గుర్తించడంతో గత రెండేళ్ల నుంచి రైస్ ఎగుమతులు పెరుగుతున్నాయని కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. దేశంలో తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్, చత్తీస్గడ్, ఒడిస్సా, అస్సాం, హర్యానా రాష్ట్రాలలో రైస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతోంది. 2021–22 లో మొత్తం 127.93 కోట్ల టన్నుల రైస్ ఉత్పత్తయిందని అంచనా.
బియ్యం ఎగుమతుల్లో రికార్డ్!
- బిజినెస్
- April 21, 2022
లేటెస్ట్
- రోడ్లపై చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలి : ఆశిష్ సంగ్వాన్
- సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల తనిఖీలు
- ప్రభుత్వాన్ని కూల్చే కుతంత్రాలను కేసీఆర్ ఆపట్లే : ఆది శ్రీనివాస్
- ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
- పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా అశోక్ గౌడ్ బాధ్యతలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్
- ఇద్దరు సీసీఎస్ సీఐల సస్పెన్షన్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..